Sunday, May 5, 2024

స్నానానికి వెళ్లి ముగ్గురు యువ‌కుల మృతి

స్నానం చేసేందుకు వెళ్లి ముగ్గురు యువ‌కులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పులివెందులలో చోటుచేసుకుంది. పులివెందుల ప‌రిధిలోని నామాలగుండు నీటిగుండంలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకులు తిరిగి ఇంటికి రాకపోవడంతో యువకుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బందితో కలిసి మృతదేహాలను నీటిగుండం నుంచి బయటకు తీశారు. చేతికి వచ్చిన కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. మృతులు ప్రొద్దుటూరుకు చెందిన బాలశేఖర్, సంజీవ్‌కుమార్, గోపాలదాస్‌గా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement