Monday, April 29, 2024

ఎంపీ అవినాష్ ను కలిసిన చైర్ పర్సన్ వేల్పుల శివమ్మ….

జమ్మలమడుగు మునిసిపల్ చైర్ పర్సన్ వేల్పుల శివమ్మ సోమవారం పులివెందుల లో ఎంపీ అవినాష్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం ఆమె మాట్లాడుతూ జమ్మలమడుగు మునిసిపాలిటీ లో 20 వార్డు లలో 18 వార్డులు కైవసం చేసుకున్న అనంతరం నన్ను చైర్మన్ అభ్యర్థిగా ఎన్నుకొ న్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు ఆమె అన్నారు జమ్మలమడుగు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలకు అందుబాటులో ఎల్లవేళల ఉంటానని ఆమె తెలిపారు ,అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ మునిసిపాలిటీ ని అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నడిపించాలని 20 వార్డు ల కౌన్సిలర్ లతో కలిసి మెలసి ఉండాలని వార్డు ల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలన్నారు ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి సహకారం తో ముందుకు నడవాలని వైఎస్సార్ పార్టీ ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు, జగన న్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్నింటినీ ప్రజల ప్రజల చెంతకు చేరే విధంగా కృషి చేయాలని ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకుడు వద్దిరాల రామాంజనేయులు యాదవ్ ,డాక్టర్ కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement