Tuesday, April 23, 2024

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్

భారత మహిళా క్రికెట్ టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ కు కరోనా సోకింది. స్వల్ప జ్వరం కారణంగా హర్మన్ ప్రీత్ కౌర్ సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా, ఆమెకు మంగళవారం కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. కరోనా పాజిటివ్ రావడంతో హర్మన్ ప్రీత్ కౌర్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉందని ఆమె తోటి క్రీడాకారిణి తెలిపారు. తేలికపాటి జ్వరంతో బాధపడుతున్న కౌర్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని మహిళా జట్టు సభ్యులు కోరారు. గాయం కారణంగా మార్చి 17వతేదీన దక్షిణాఫ్రికా జట్టుతో లక్నోలో జరిగిన టీ20 సిరీస్ నుంచి ఆటకు దూరంగా ఉంటోంది హర్మన్ ప్రీత్ కౌర్. అంతేకాదు తాజాగా భార‌త మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌కు కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ఇర్ఫాన్ కంటే ముందు స‌చిన్ టెండూల్క‌ర్, బ‌ద్రీనాథ్‌, యూసుఫ్ ప‌ఠాన్‌ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. వీరంతా కూడా రోడ్ సేఫ్టీ వల్డ్ సిరీస్ లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement