Sunday, April 28, 2024

AP | టీడీపీలో అసమ్మతి సెగలు.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

ఎన్నిక‌ల‌ వేల రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి.. తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన మాజీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్ చార్జి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని, తనకు కాకుండా మరొకరికి రాయచోటి టికెట్ కేటాయించడం దారుణమని విమర్శించారు.

దాదాపు నలభై, యాభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి బయటి వారికి టిక్కెట్లు ఇచ్చారు. అధికారంలోకి రాబోతున్నామని ఫేక్ హైప్ క్రియేట్ చేసి డబ్బున్న వారికే టిక్కెట్లు ఇచ్చారు. మాకు టికెట్ ఇవ్వకపోయినా మేము బాధపడేవాళ్లం కాదు. కానీ కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్లే టీడీపీని వీడాల్సి వస్తోంది. టీడీపీకి పనిచేసినట్లే వైసీపీకి కూడా పని చేయాలని నిర్ణయించుకున్నా’’ అని రమేష్ కుమార్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement