Thursday, April 25, 2024

JEE Main Session 2 – పరీక్ష షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

న్యూ ఢిల్లీ – జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసుకుంది. గత నెలలో ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. తాజాగా ఈ పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల విడుదల సందర్భంగా గురువారం ఇచ్చిన ప్రకటనలో ఈ తేదీలను పొందుపరిచింది. అంతకుముందు షెడ్యూల్‌ విడుదల సమయంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య జెఈఈ మెయిన్ 2 పరీక్షలు జరుగుతాయని పేర్కొన్ననేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆ తర్వాత ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ షెడ్యూల్‌లోనూ మార్పులు చేయడం గమనార్హం.

సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం క్లిక్‌ చేయండి

సవరించిన షెడ్యూల్‌ ప్రకారం.. జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ/బీటెక్‌) పరీక్ష ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుండగా; పేపర్‌ – 2 పరీక్ష ఏప్రిల్‌ 12న నిర్వహించనున్నారు. పేపర్‌-1 పరీక్ష రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) జరగనుంది. అలాగే, పేపర్‌-2 పరీక్ష ఒకే షిఫ్టు (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు) నిర్వహించనున్నారు.

ఇదిలాఉండగా.. అభ్యర్థులకు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేయడం ద్వారా పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు తదితర సమాచారం ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు త్వరలోనే విడుదల చేయనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement