Sunday, April 28, 2024

AP | సర్టిఫికెట్లపై జగన్ ఫోటో.. ఏపీ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో వివిధ స‌ర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా సర్టిఫికెట్లపై సీఎం జగన్ ఫోటో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఫొటో లేకుండా కొత్త స్టేషనరీ వ‌చ్చే వ‌ర‌కు స‌ర్టిఫికెట్లు జారీ చేయవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కలెక్టరేట్లతో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం కూడా రద్దయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement