Saturday, May 18, 2024

రాష్ట్ర విభజన కంటే.. ఏపీకి జగన్ వల్లే ఎక్కువ నష్టం.. చంద్రబాబు

రాష్ట్ర విభజన కంటే ఏపీకి జగన్ వల్లే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ… ఎన్డీయే లో చేరిక అంశంపై ఇప్పుడే స్పందించనని తెలిపారు. ఆనాడు ఏపీ ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. ఏపీ ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామన్నారు. ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు. వైసీపీ నేతలు కూడా ఇప్పుడు కంటి నిండా నిద్రపోవడం లేదన్నారు. వ్యవస్థలు నాశనమయ్యాక ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి వచ్చేసిందన్నారు. ఏపీకి మంచిపేరు తేవాలనే వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement