Sunday, April 28, 2024

CM JAGAN: ఇవాళ విదేశీ విద్యాదీవెనకు రూ .41.60 కోట్లు జమ

ఏపీలో జగనన్న విదేశీ విద్యాదీవెనకు జగన్ సర్కార్ నేడు రూ.41.60 కోట్లు జమ చేయనుంది.అర్హులైన 390 మంది విద్యార్థులకు ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ రిలీజ్ చేయనుంది. వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.50 లక్షలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం రూ.42.6 కోట్లు నేడు బటన్‌ నొక్కి జమచేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇవాళ ఉదయం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ నిధులు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement