Friday, May 3, 2024

రెండు బ‌యో ఇథ‌నాల్ ఎన‌ర్జీ ప్లాంట్ ల‌కు జ‌గ‌న్ శంఖుస్థాప‌న‌…

అమరావతి – నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో నిర్మించనున్న రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్లకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. తన కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ. 925 కోట్ల వ్యవయంతో ఈ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. క్రిబ్కో విశ్వసముద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్లాంట్లను నిర్మిస్తున్నారు. వీటి వల్ల స్థానికంగా ఉన్న దాదాపు 75 శాతం యుతకు ఉపాధి లభిస్తుంది.

కాగా, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థను కూఆ ప్రారంభించిన జగన్… క్రిభ్ కో గ్రీన్ ఎనర్జీ, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరెజెస్ పరిశ్రమలకు వర్చువల్ గా శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్ నాథ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement