Sunday, April 28, 2024

AP: మ‌త‌,కుల‌, పార్టీల‌కు అతీతంగా అంద‌రికీ సంక్షేమ అందిస్తున్న ఏకైక సిఎం జ‌గ‌న్ – పెద్దిరెడ్డి

శ్రీ‌ సత్యసాయి జిల్లా: వచ్చే ఎన్నికల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌ , చంద్రబాబు పాలన బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలనిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. హిందూపూర్‌ నియోజకవర్గంలో ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99.5 శాతం అమలు చేసిన ఘనత జ‌గ‌న్ దే అన్నారు.

కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్.. హైదరాబాద్ లో దాక్కున్నారని దుయ్యబట్టారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎక్కడా కులాలు, మతాలు, పార్టీలు చూడలేద‌ని .. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించారని ప్రశంసలు కురిపించారు. పాలన అంతా ప్రజల ఇంటి ముందు ఉన్న సచివాలయంలోనే ఉందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లాగా జన్మభూమి కమిటీలను వేసి ప్రజల్ని దోచుకునే పరిస్థితి లేద‌న్నారు.. నేరుగా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఏకైక సిఎం జ‌గ‌నే అంటూ ని కొనియాడారు.. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా.. సీఎం బటన్‌ నొక్కి లబ్ధిచేకూరుస్తున్నారని తెలిపారు. మరోవైపు.. పెన్షన్ లు పెంచి రూ మూడు వేలు చేస్తే… పెన్షన్ ఇవ్వరు అంటూ టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement