Saturday, May 4, 2024

జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్ ప్ర‌జ‌ల నినాదం.. మంత్రి సురేష్

జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ అనేవి ప్ర‌జ‌ల నినాద‌మ‌ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా యర్రగొండపాలెం పట్టణంలో ఇంటింటికి తిరిగి లబ్దిదారులతో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 5కోట్ల మంది ప్రజలను కలిసి, వారికి జరిగిన లబ్దిని తెలుసుకునే ప్రతిష్టాత్మక ప్రచార కార్యక్రమమ‌న్నారు. అలాగే మంత్రి గుడ్ ఫ్రైడే సందర్భంగా జరుగుతున్న ప్రార్ధనల్లో మంత్రి సురేష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement