Saturday, May 4, 2024

అమీషా ప‌టేల్ చెక్ బౌన్స్ కేసులో.. వారెంట్ జారీ

బాలీవుడ్ న‌టి అమీషా ప‌టేల్ చెక్ బౌన్స్ కేసులో కోర్టు వారెంట్ ని జారీ చేసింది. కాగా గత కొంతకాలంగా అమీషాను పలు వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా అమీషా పటేల్ మరోసారి చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. రాంచీలోని కోర్టు అమీషా పటేల్ తో పాటు, ఆమె వ్యాపార భాగస్వామి కునాల్‌కు వారెంట్ జారీ చేసింది.ఈ కేసు 2018 సంవత్సరానికి సంబంధించినది. అమీషా పటేల్ .. ఆమె వ్యాపార భాగస్వామి కునాల్‌పై అజయ్ కుమార్ సింగ్ అనే నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు అమీషా, కునాల్ పై మోసం, బెదిరింపు,యు చెక్ బౌన్స్ లపై ఫిర్యాదు చేశారు.కేసు కోర్టు మెట్లు ఎక్కింది. అయితే విచారణ సమయంలో అమీషా పటేల్ కానీ ఆమె తరపు లాయర్ గానీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అమీషా పటేల్ తో పాటు కునాల్‌కు రాంచీ కోర్టు వారెంట్ జారీ చేసింది.

కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 15 కు వాయిదా వేసింది.‘దేశీ మ్యాజిక్’ అనే సినిమా మేకింగ్, పబ్లిసిటీ కోసం అమీషా పటేల్ .. ఆమె భాగస్వామి కునాల్ తన నుండి రూ. 2.5 కోట్లు తీసుకున్నారని అజయ్ కుమార్ సింగ్ ఆరోపించాడు. చిత్ర పూర్తి అయ్యాక తిరిగి ఇస్తామని ఆ సమయంలో అమీష చెప్పిందని తెలిపారు. ‘దేశీ మ్యాజిక్’ సినిమా షూటింగ్ 2013లో మొదలైంది.. అయితే ఇప్పటికీ ఆ సినిమా సినిమా విడుదల కాలేదని అజయ్ కుమార్ పేర్కొన్నారు.తర్వాత అజయ్ కుమార్ తన డబ్బును అమీషా పటేల్‌ను అడగగా, దానిని ఇవ్వడానికి నటి నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరకు 2018లో అజయ్ కుమార్ కు నటి అమీషా రూ.2.5 కోట్ల 50 లక్షల కు గాను రెండు చెక్కులు ఇచ్చింది. అయితే అవి బౌన్స్ అయ్యాయి. దీంతో అజయ్ చెక్ బౌన్స్ కేసుతో పాటు తనను డబ్బులు అడిగినందుకు బెదిరిస్తోంది అంటూ ఫిర్యాదు చేశాడు.అమీషా తెలుగులో బ‌ద్రీ చిత్రంలో మెరిసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement