Tuesday, May 14, 2024

25న సీఎం జగన్‌ విజయనగరం జిల్లా పర్యటన

అమరావతి. – ఈ నెల 25న సీఎం జగన్‌ విజయనగరం జిల్లాలో పర్యటి.చనున్నారు . కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి పాల్గొననున్నారు.

సీఎం జగన్‌ 25 ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మెంటాడ మండలం చినమేడపల్లి చేరుకుంటారు. అక్కడ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో కేంద్రమంత్రితో కలిసి పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement