Tuesday, May 21, 2024

స్టార్టప్స్ తో స్ర్టాంగెస్ట్…

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సువిశాల తీరప్రాంతం ఉన్నందు న పోర్టు ఆథారిత పరిశ్రమలకు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్టార్టప్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నా రు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంలో భాగంగా ప్రపంచ మార్కెటింగ్‌తో అనుసంధానమైతే సత్ఫలితాలు సాధించ వచ్చన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్‌, ఆర్ధికశాఖ కార్యదర్శులు కే వీ వీ సత్యనారాయణ, గుల్జార్‌లతో పాటు- ఇతర ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్‌ వరకు చేయూతనందించే విధంగా విధానం అమలు కావాలన్నారు. న్యూ ఇండస్ట్రియ్రల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీలో మార్కెటింగ్‌ -టై అప్‌ విధానం పై దృష్టి సారించాలని నిర్దేశించారు. అంతర్జాతీయంగా మార్కెటింగ్‌ -టైఅప్‌ చేయగలిగితే ఎంఎస్‌ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీ- ఎక్కువగా ఉంటు-ందని.. సరైన మార్కెటింగ్‌ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయన్నారు. కాన్సెప్ట్‌ నుంచి కమిషనింగ్‌, మార్కెటింగ్‌ వరకు హేండ్‌ హోల్డింగ్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అడ్వైజ్‌ (తగిన సలహాలు), అసిస్ట్‌ (సహకారం) అండ్‌ సపోర్టివ్‌ (మద్దతు)గా ఎంఎస్‌ఎంఈ పాలసీ రూపుదిద్దుకోవాలని అభిలషించారు. స్టార్టప్‌ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్‌ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని సూచించారు. మంచి లొకేషన్‌లో భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాయం కూడా ఉండాలన్నారు. స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోర్ట్‌ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పనదిశగా దృష్టిసారించాలన్నారు. ఈ అంశాల ప్రాతిపదికగా ఇండిస్ట్రియ్రల్‌ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement