Saturday, May 4, 2024

AP CM: సంక్రాంతి సంబ‌రాల‌లో జ‌గ‌న్ దంప‌తులు…

తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో జగన్ దంపతులు భోగి మంటలు వేయడంతో పాటు పండుగ సంబురాలను మొదలు పెట్టారు.

అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. వేదపండితులు సీఎం జగన్‌ దంపతులకు ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.


ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి, క‌నుమ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఊరూ వాడా ఒక్క‌టై.. బంధు మిత్రులు ఏక‌మై..అంబ‌ర‌మంత సంబ‌రంగా జ‌రుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాల‌తో..విజ‌యానందాల‌తో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నానని ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement