Wednesday, May 8, 2024

AP: 11న జగన్ కేబినెట్ భేటి…

అమరావతి: ఈ నెల 11న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలను ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. విశాఖ నుంచి పరిపాలన, నవరత్నాల పథకాల అమలుకు ఆమోదం సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వంటి అంశాలపై సీఎం జగన్ కేబినెట్‌లో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement