Thursday, May 9, 2024

IT Raids: ఏపీ, తెలంగాణలో ఐటీ సోదాలు

ఏపీ, తెలంగాణలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీ పుల్లయ్య అనే వ్యక్తి నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నారు.

ప్రొద్దుటూరులోని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు కూడా కేసీ సంస్థే చేపడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కేసీ పుల్లయ్య సంస్థల్లోనూ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement