Thursday, May 2, 2024

Kejriwal ఈడీ విచారణకు మ‌ళ్లీ డుమ్మా…రెండోసారి నోటీసులు

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులను ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ లెక్క‌చేయ‌లేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు ఆయ‌న మళ్లీ డుమ్మా కొట్టారు. ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమని, అక్రమమని ఈడీకి ఆయన జవాబిచ్చారు.

ఈ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను నీతినిజాయితీలతో జీవిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. నవంబర్ 2న విచారణకు రమ్మని పిలవగా.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని, ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ నోటీసులు కేంద్రం ఇప్పించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అప్పుడు విచారణకు వెళ్లలేదు. దీంతో నోటీసులు వాపస్ తీసుకున్న ఈడీ.. తాజాగా గురువారం (ఈ నెల 21న) విచారణకు హాజరు కావాలని మరోమారు నోటీసులు పంపింది. అయితే, ఈసారి కూడా ఆయన విచారణకు వెళ్లలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement