Wednesday, May 1, 2024

మోడల్‌ ఇంటర్వ్యూ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.

అమరావతి, ఆంధ్రప్రభ: గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర అభ్యర్థులు మోడల్‌ ఇంటర్వ్యూ కొరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు సూచించారు. ఏపీపీఎస్‌సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 15 నుంచి మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈనేపథ్యంలో మౌఖిక పరీక్షకు సరైన అనుభవం, తర్ఫిదు ఇచ్చేందుకు ఏపీ స్టడీ సర్కిల్‌ ద్వారా మోడల్‌ ఇంటర్వ్యూలను అనుభవం గల ప్యానల్‌ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు కుటుంబ సంవత్సర వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతోందన్నారు. ఈనెల 13వ తేదీ లోపు ఏపీఎస్‌టీడీసీ డాట్‌ ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ డాట్‌ ఇన్‌ పోర్టల్‌ నందు మోడల్‌ ఇంటర్వ్యూ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement