Sunday, April 28, 2024

సీఎస్‌కు ఏబీవీ లేఖ…

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మకు సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తన సస్పెన్షన్‌పై హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదని ఏబీవీ తెలిపారు. ”సస్పెండ్‌ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే.. నా సస్పెన్షన్‌ రివోక్‌ చేయాలనే విషయాన్ని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయన్నారు. జీవోను సవరించాలన్న విజ్ఞప్తిని ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని సీఎస్‌ కు రాసిన లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement