Thursday, May 2, 2024

Indrakeeladri – దుర్గమ్మ ఆలయ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి..

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో)కొత్త సంవత్సరం లో రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు ముఖ్యమంత్రి కి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులను ఆలయ వేద పండితులు అర్చకులు అందజేశారు.

నూతన సంవత్సరం సందర్భంగా తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ వేదపండితులచే వేదాశీర్వచనం అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈ వో రామారావు తెలిపారు. అలాగే శ్రీ అమ్మవారి ప్రసాదములు, వస్త్రం, చిత్రపటంను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆలయ నూతన సంవత్సరం క్యాలండర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె ఎస్ జవహర్ రెడ్డి, నగర పశ్చిమ శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్, నగర సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్, ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement