Wednesday, May 8, 2024

Encounter | ఛత్తీస్గడ్‌లో ఎదురుకాల్పులు.. ఆరు నెలల చిన్నారి మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముతవండిలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఆరు నెలల బాలిక మృతి చెందింది. బాలిక తల్లితో పాటు ఇద్దరు డీఆర్‌జీ సైనికులు బుల్లెట్‌ గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌లో పలువురు నక్సల్స్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముతవంటి గ్రామ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు డీఆర్‌జీ సైనికులు గాయపడ్డారు. గ్రామానికి చెందిన ఆరు నెలల చిన్నారి బుల్లెట్‌ తగిలి చనిపోయింది. అదే సమయంలో బాలిక తల్లి చేతికి బుల్లెట్‌ గాయమైంది. అదనపు సూపరింటెండెంట్‌, పోలీసులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌లో భైరంగఢ్‌ ఏరియా కమిటీ కార్యదర్శి చంద్రన్నతో పాటు పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది గాలింపులు చేపట్టారని ఉన్నతాధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement