Monday, April 29, 2024

Indrakeeladriపై దివ్య కాంతుల నడుమ కోటి దీపోత్సవం…

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కోటి దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రదోషకాలంలో దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో కోటి దీపాలను భక్తులు, ఆలయ సిబ్బంది, బోర్డు సభ్యులు వెలిగించారు. దేదీప్యమైన వెలుగుల కాంతిరేఖల్లో ఇంద్రకీలాద్రి స్వర్ణ శోభితంగా వెలుగులు చిమ్మింది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దీప ప్రజ్వలన ఆదివారం సాయంత్రం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే చిన్న గోపురం వద్ద ఏర్పాటుచేసిన జ్వాలా తోరణం వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్వాలాతోరణాన్ని వెలిగించారు. ఈ కోటిదిపోపోత్సవం లో పాల్గొనేందుకు, తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి, దీపాలు వెలిగించి అమ్మవారిని స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయ కార్యక నిర్వాహక అధికారులు, వైదిక కమిటీ సభ్యులు, పురోహితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement