Wednesday, May 15, 2024

Breaking: శ్రీ‌శైలంలో పెరిగిన ర‌ద్దీ.. వీకెండ్ కావ‌డంతో త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు

శ్రీ‌శైలంలో మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నానికి భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. అందులో వీకెండ్ కావ‌డంతో భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంది. ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు ముగిసి, రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, సెల‌వులు కావ‌డంతో చాలామంది మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకోవ‌డానికి త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ర‌ద్దీ ఏర్ప‌డుతోంది. దీనికి త‌గ్గ‌ట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారి దర్శనానికి దాదాపు 6 గంటలకుపైగా పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement