Saturday, May 4, 2024

Breaking: కాకినాడలో దారుణం.. బాలికపై స్కూల్​ కరెస్పాండెంట్​ అత్యాచారం

ఏపీలోని కాకినాడలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్​ స్కూల్​ కరస్పాండెంట్​ అదే స్కూల్​లో చదువుతున్న బాలికపై అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఇది చాలాకాలంగా జరుగుతున్నట్టు సమాచారం. ఆ స్కూల్​లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇలా చదువు పేరుతో అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే కీచకుడు విజయ్​కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని​ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఎంతమంది పిల్లలపై ఇట్లాంటి ఘాతుకానికి ఒడిగట్టాడో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement