Wednesday, May 15, 2024

హైదరాబాద్‌ తరహాలో విశాఖ అభివృద్ధి.. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ బెస్ట్‌: అమర్‌ నాథ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: విశాఖ నగరాన్ని హైదరాబాద్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. శుక్రవారం మంత్రి మంగళగిరిలోని ఏపీఐఐసీలోని పరిశ్రమల శాఖ మంత్రి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రవాసినైన తాను పరిశ్రమల మంత్రినవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగానే కాదు పారిశ్రామిక నిలయంగా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటు-కు ఆంధ్రప్రదేశ్‌ బెస్ట్‌ అని పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌ నాథ్‌ పేర్కొన్నారు.

అపార సహజ వనరులు, సకల సదుపాయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టు-బడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడతారని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సుపరిపాలన ఏపీకి అతిపెద్ద వనరుగా మంత్రి పేర్కొన్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అందించే నిర్ణయం ఓ అద్భుతమని అమర్‌ నాథ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement