Sunday, May 19, 2024

Killed – రాక్షస భర్త ను చెంబుతో కొట్టి చంపిన భార్య

ఆయినవిల్లి భర్త రోజూ తాగి వచ్చి చిత్రహింసలు పెడుతుండటంతో విసిగిపోయిన భార్య చెంబుతో కొట్టి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో చోటుచేసుకుంది.

ఇసుకపట్ల రామకృష్ణ (34) రోజూ తాగి వచ్చి భార్యతో పాటు తల్లిదండ్రులను కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ.. చెంబుతో భర్త తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడని స్థానికులు తెలిపారు. భర్త చిత్రహింసలు భరించలేకే అతడిపై దాడి చేసినట్లు కుటుంబసభ్యులకు నారాయణమ్మ తెలిపింది. ఆపై పోలీసు స్టేషన్‌లో ఆమె లొంగిపోయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement