Tuesday, April 30, 2024

భారీ గజమాలతో చంద్ర‌బాబుకు స్వాగతం..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి , టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ టిడిపి నాయకుడు.. మాజీ బోయకొండ చైర్మన్ వెంకటరమణారెడ్డి తన అనుచరవర్గంతో కలిసి చంద్రబాబును కలిశారు. ఈ సంద‌ర్భంగా గజమాలతో చంద్రబాబుకు స్వాగతం పలికి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయం అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేసి.. ప్రతి గ్రామంలోని ఆల‌యాల‌లో గుడిగంటల‌ను మంగళకరంగా మోగిస్తామన్నారు. శాంతియుత పాలనని తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మనోహర కుమార్ రెడ్డి.. విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement