Sunday, May 5, 2024

స‌మ‌సిన గొడ‌వ‌లు.. ఇండియ‌న్2 షూట్ రీస్టార్ట్..

త్వరలోనే ‘ఇండియన్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది.. తాజాగా దర్శకుడు శంక‌ర్.. మేకర్స్ లైకా ప్రొడక్షన్స్ మధ్య వివాదం సమసింద‌ట‌.. ఇరువురూ కలసి ఓ ఒప్పందానికి వచ్చార‌ని స‌మాచారం. సామరస్యపూర్వకంగా ఈ వివాదం ముగియడంలో హీరో కమలహాసన్ మధ్యవర్తిత్వం నెరపినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, ప్రస్తుతం హీరో రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా పూర్తయ్యాక, ద‌ర్శ‌కుడు శంకర్ ‘ఇండియన్ 2’ చిత్రం షూటింగును పూర్తిచేస్తాడట. ఆ తర్వాత తాను హిందీలో చేయాలనుకుంటున్న ‘అపరిచితుడు’ రీమేక్ ను ఆయన ప్రారంభిస్తాడని టాక్. ఇండియ‌న్2 చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన ద‌గ్గ‌ర ప‌లు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.

ఈ చిత్ర షూటింగ్ లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం ద‌గ్గ‌ర నుంచి అన్నీ అవాంత‌రాలే. ఇండియ‌న్ చిత్రానికి సీక్వెల్ గా అదే కాంబినేషన్ లో ‘ఇండియన్ 2’ చిత్రాన్ని కొన్నాళ్ల క్రితం ప్రారంభించారు. కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఈ షూటింగ్ సెట్ లో ప్రమాదం జరిగి.. కొందరు టెక్నీషియన్లు మరణించారు. ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింద‌నుకున్న స‌మ‌యంలో క‌రోనా విజృంభించింది. ఆ తర్వాత దర్శకుడు, మేకర్స్ మధ్య బడ్జెట్టు విషయంలో భేదాభిప్రాయాలు రావడం..ఈ విషయం కాస్తా కోర్టుకి వెళ్లడం.. అక్కడ దర్శకుడికి అనుకూలంగా తీర్పు రావడం.. ఇలా పలు కారణాల వల్ల మళ్లీ ఈ చిత్ర‌ షూటింగ్ మొదలవలేదు. ఈలోగా శంకర్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా మొదలెట్టేశారు కూడా. ఎట్ట‌కేల‌కు ఈ వివాదాల‌కు తెర‌ప‌డి సినిమా షూటింగ్ ని రీస్టార్ట్ చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement