Thursday, May 2, 2024

AP:భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో
జిల్లావ్యాప్తంగా గంజాయి రవాణా విక్రయాలపై ఉక్కుపోదం మోపుతున్న పోలీసులను కల్లుగప్పి మాఫియా పెద్ద ఎత్తున గంజాయిని జిల్లా సరిహద్దుల గుండా తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు నడిబొడ్డుగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టు వేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఎక్కడో అక్కడ ప్రతిరోజు గంజాయి పట్టుబడితోనే ఉంది. విశాఖపట్నం నుండి పెద్ద ఎత్తున గంజాయిని ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడ మీదుగా రాష్ట్రాల సరిహద్దులను నటిస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున గంజాయిని రాష్ట్రం సరిహద్దు దాటించేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు కట్టడి చేశారు. భారీ కంటైనర్ లో విశాఖపట్నం నుండి వేరే ప్రాంతానికి తరలిస్తున్న 250 కేజీల గంజాయిని వలవేసి పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా లోని కంచికచర్ల మండలం కీసర గ్రామ టోల్ గేట్ వద్ద కంటైనర్ లారీ ను పోలీసులు తనిఖీ చేయగా అందులో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది.సుమారు 250 కేజీల గంజాయ నీ పోలీసులు స్వాధీనం చేసుకుని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కి తరలించారు. అంతేనర్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆరలలో ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. కంటైనర్ డ్రైవర్ తో పాటు మరో ముగ్గురుని కంచికచర్ల సిఐ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న లారీ వైజాగ్ నుండి హర్యానా వెళుతున్నట్లుగా పుట్టించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement