Monday, May 13, 2024

Flash: కర్నూలులో భారీగా నగదు పట్టివేత

కర్నూల్ నగరంలోని పంచలింగాల చెక్పోస్ట్ వద్ద గురువారం తెల్లవారు జామున భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సెబ్ సిఐ మంజుల, ఎస్ఐ జీవి రాముడు సిబ్బంది చేపట్టిన వాహన తనిఖీలో హైదరాబాద్ నుoడి రాజంపేట మార్నింగ్స్ స్టార్ ప్రవేట్ స్లీపర్ బస్సులో రాజమండ్రికి చెందిన అంతరవేది ఉదయ్ కుమార్ (25సం) తన వద్ద బ్యాగు లో రూ. 1.25 కోట్ల నగదు తీసుకెళ్తుండగా తనిఖీలో భాగంగా గుర్తించారు. ఈ నగదు కు సబందించిన ఎలాంటి ఆధారాలు చూపలేదు తను ఈ నగదును హైదరాబాద్ నుండి రాజాంపేటకి రైల్వే కాంట్రాక్టర్ కి ఇవ్వటానికి తీసుకెళుతున్నట్లు చెప్పాడు. అయితే వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు, బిల్లులు చూపక పోవడంతో ఈ నగదు తదుపరి విచారణ నిమ్మితం కర్నూలు పోలీసు స్టేషన్ కు పంపినట్టు సిఐ మంజుల తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement