Friday, May 3, 2024

అత్యాచారాలపై దిశ చట్టం ద్వారా ఉరిశిక్ష విధించవచ్చు: మంత్రి సుచరిత

దిశ చట్టం ద్వారా అత్యచార నిందితులకు 7 రోజుల్లోనే శిక్ష విధించవచ్చిన తెలిపారు ఏపీ హోం మంత్రి సుచరిత.. అంతేకాదు అత్యాచారాలపై దిశ చట్టం ద్వారా ఉరిశిక్ష విధించవచ్చని తెలిపారు. జగ్గంపేట మం. జడ్ రాగంపేటలో దిశ యాప్ అవగాహన సదస్సులో హోం మంత్రి సుచరిత పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ దిశ చట్టం ఏర్పాటు చేసారని తెలిపారు. విజయవాడలో చిన్నారిపై జరిగిన సంఘటలో 4 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారయ్యింది. దిశ చట్టం కేసులకు సంబంధించి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు.. తక్షణ సహాయం కోసం దిశ యాప్ ఉపయోగపడుతుంది. దిశ యాప్ ను యవతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్చ్..తొలి టెస్టుకు చివరి రోజు వరుణుడు అడ్డంకి..

Advertisement

తాజా వార్తలు

Advertisement