Sunday, May 5, 2024

AP: గుండెపోటుతో హోంగార్డు మృతి..

కంబదూరు: మండలంలోని అండేపల్లికి చెందిన హోంగార్డ్ మారెన్న(40) గుండెపోటుతో మంగళవారం రాత్రి మరణించారు. విధి నిర్వహణలో ఉండగానే ఆయన గుండెపోటుకు గురై మరణించారు. మృతుడు రాయదుర్గం పోలీసు స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్నారు.

మారెన్న మృతదేహాన్ని ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దహన సంస్కారాలకు కళ్యాణదుర్గం హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున రూ.10 వేల నగదు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement