Thursday, May 16, 2024

ఏపీ సీఐడీ చీఫ్ కు హైకోర్టు నోటీసులు

ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఏపీ హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని సునీల్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది. రఘురామ తన పిటిషన్ లో పలు అంశాలు పొందుపరిచారు. సునీల్ కుమార్ కు, ఆయన భార్యకు వివాదాలున్నాయని తెలిపారు. అయితే తన భార్యకు తాను మద్దతుగా ఉన్నానని సునీల్ కుమార్ అపోహపడుతున్నారని వివరించారు. ఈ కారణాలతోనే సునీల్ కుమార్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. అంతేకాదు, ప్రైవేటుగా ఓ సంస్థ ఏర్పాటు చేసి క్రైస్తవ మతాన్ని, మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని కూడా ర‌ఘురామ కృష్ణ‌రాజు నివేదించారు. ఈనేప‌థ్యంలో ఏపీ హైకోర్టు ఆయ‌నకు నోటీసులు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement