Thursday, May 2, 2024

ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ లో ఫీజుల‌పై నిరంత‌ర నిఘా – ఎపి ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్స, ఫీజుల వసూలు, ఇతర అంశాలపై వెంటనే ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయాలని ఎపి ప్ర‌భుత్వానికి హైకోర్టు సూచించింది. కొవిడ్‌ రోగులకు అందుతున్న చికిత్సపై సామాజిక కార్యకర్త తోట సురేష్‌, ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ వేసిన పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. అనంత‌రం హైకోర్టు ఎపి ప్ర‌భుత్వానికి పలు సూచ‌న‌లు చేసింది.. ఆక్సిజన్‌ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆక్సిజన్‌ కొరతపై ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని కూడా ఆదేశించింది… రాష్ట్రంలో ఐసోలేషన్‌ కేంద్రాలను పెంచాలని , అలాగే పడకల సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకోవాలని కోరింది..రాష్ట్రంలోని అన్ని కొవిడ్ హాస్ప‌ట‌ల్స లో రోగులు, ఖాళీల వివరాలు తెలిపే డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రెమ్‌డెసివిర్‌, అత్యవసర మందులపై రోజువారీ సమీక్ష ఉండాల్సిందేనని హైకోర్టు సూచించింది. క‌రోనా క‌ట్ట‌డికి అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని హైకోర్టు కోరింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement