Tuesday, April 30, 2024

జ‌గ‌న‌న్న తోడుతో 3.95ల‌క్ష‌ల మందికి సాయం.. సీఎం జ‌గ‌న్

జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కంతో రాష్ట్రంలోని 3.95ల‌క్ష‌ల మంది చిరు వ్యాపారుల‌కు సాయం అందుతుంద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. తాడేప‌ల్లి సీఎం క్యాంప్ కార్యాల‌యంలో జగనన్న తోడు పథకం కింద సీఎం జగన్ రుణాలు, వడ్డీ మాఫీ నిధులు విడుదల చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి రుణాలు, వడ్డీ మాఫీ నిధులు మంజూరు చేస్తున్న‌ట్లు. 6 నెలలకు సంబంధించిన 15.17 కోట్ల రూపాయల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.ఒక్కొక్కరికీ 10 వేల రూపాయల చొప్పున 3.95 లక్షల మందికి రుణాలు మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా కొత్తగా 395 కోట్ల రూపాయల కొత్త రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయనుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement