Saturday, April 27, 2024

అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో నిందితుడైన‌ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్‌ అవినాష్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్‌ పిటిషన్‌పై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement