Monday, April 29, 2024

డివైడ‌ర్ ను ఢీకొట్టిన కారు.. ఐదుగురికి తీవ్ర‌గాయాలు

కారు డివైడ‌ర్ ను ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బుడంపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ పాపతో పాటు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మంకు చెందిన వీరంతా కారులో అరుణాచలం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement