Friday, April 26, 2024

రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి..

శ్రీకాకుళం : జిల్లాలోని నందిగాం మండలం పెద్దినాయుడుపేట జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పలాసకు చెందిన వైద్యుడు రమేష్ తన కుటుంబంతో విశాఖపట్నం నుండి పలాస వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. నిద్రమత్తులో ఉన్న కారణంగా కారు డివైడర్ ను ఢీకొనడంతో వైద్యుడు రమేష్, అతని కుమారుడు సంకల్ప్ ఈ ప్రమాదంలో మృతిచెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పలాస ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement