Wednesday, May 1, 2024

Guntur : అనుమర్లపూడిలో టెన్షన్ వాతావరణం..

గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ధూళిపాళ్ల న‌రేంద్ర‌ మట్టి తవ్వకాల పరిశీలన కోసం అనుమతి లేకుండా గ్రామంలోకి రావడంతో ధూళిపాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేసి తెనాలి తరలిస్తున్నారు.


అంత‌కంటే ముందుగా అనుమర్లపూడి చెరువు వద్ద ధూళిపాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈసంద‌ర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం జ‌రిగింది. చలో అనుమర్లపూడికి పిలుపునివ్వ‌డంతో.. పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ పై టీడీపీ పోరాటానికి దిగింది. వైసీపీ నేతలు మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని నిరసన వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న సంద‌ర్భంగానే ధూళిపాళ్ల‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement