Friday, April 19, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టు మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు 9 గంటల సమయం పడుతుంది.కంపార్టు మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిన్న శ్రీవారిని 90,471మంది భక్తులు దర్శించుకోగా 37,039 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement