Tuesday, May 21, 2024

వివిఐటి విద్యార్థుల శివోహం

పెదకాకాని ,ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్) – మండల పరిధిలోని నంబూరు గ్రామం వివిఐటి కళాశాలలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు శివోహం కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ జానపద కళాకారులకు అందించు విశ్వనాథ సంస్కృతి పురస్కార వేడుక జరిగింది. వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, విశ్వనాథ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ మద్దినేని సింహ కౌటిల్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హరికథ చూడామణి ఎం సింహాచల శాస్త్రి కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం-2023 ను సత్కరించారు. విద్యార్థులకు సింహాచల శాస్త్రి కథకులుగా హరికథా గానం, గిరిజా కళ్యాణం వినిపించారు. అనంతరం నంబూరు శివాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement