Wednesday, May 8, 2024

మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమ నిర్వహణపై అవగాహన సదస్సు

తెనాలి, ఫిబ్రవరి 19 ప్రభా న్యూస్ : మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదంతో తెనాలి టౌన్ మరియు తెనాలి మండల సచివాలయ కన్వినర్లకు, గృహసారధులకు, గ్రామ వార్డు వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం ఎమ్మెల్యే శివకుమార్ సూచనలతో పార్టీ శ్రేణులు నిర్వహించారు. పట్టణం లోసుల్తానాబాద్ లోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆదివారం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగిస్తూ వైసిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే బాధ్యత సచివాలయ కన్వీనర్లు గృహ సారధులు వాలంటీర్లపై ఉందని తెలిపారు.

ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరవేయడంలో సైతం కన్వీనర్లు గృహసారథులు వాలంటీర్లు కీలక భూమిక పోషించాలని తెలిపారు. గృహ సారథులు కన్వీనర్లు వాలంటీర్లు నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర అధినాయకత్వం సూచనలతో కన్వీనర్లు బృహసారథులు వాలంటీర్ల నియామకం జరిగిందన్నారు. పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో మీ కప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వైసిపి పదాధికారులు, నామినేటెడ్ పదవులు పొందిన నేతలు, వైసిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement