Sunday, May 5, 2024

స్కూల్ బ‌స్సు బోల్తా.. 10మంది విద్యార్థుల‌కు గాయాలు

స్కూలు బ‌స్సు బోల్తాప‌డి 10మంది విద్యార్థుల‌కు గాయాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో స్కూలు బస్సు బోల్తా పడింది. ప్రమాద ఘటనలో పదిమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. దైద నుంచి గురజాలకు వెళ్తున్న బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. గాయపడిన విద్యార్థులను గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement