Thursday, May 16, 2024

డైయిరీని దెబ్బతీయాలనే ధూళిపాళ్ళ అరెస్టు

రాజుపాలెం – సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అక్రమ అరెస్టులకు నిరసనగా సొమవారం రెడ్డిగూడెం పాల ఉత్పత్తి దారుల అద్యక్షుడు నల్లబోతుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా నల్లబోతుల శ్రీనివాసరావు మాట్లడుతూ దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీపై కక్ష్య సాధింపు చర్యలలో భాగంగానే నరేంద్రను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నరేంద్ర అరెస్టుతో సంగం డైయిరీని దెబ్బతీయాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కుట్రలను ప్రజలంతా గమనిస్తూన్నారని,ప్రజలే జగన్ రెడ్డికి బుద్ధి చెబుతారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాలఉత్పత్తి దారులు మహిళలు మరియు గ్రామ ఉపసర్పంచ్ నిమ్మకాయల షేక్ మహబూబ్ సుభాని నిమ్మకాయల షేక్ అల్లభక్షు, షేక్ కరీముల్లా, షేక్ దరియవాలి,ఉగ్గం శ్రీనివాసరావు, కుంభ నాగేంద్రం, షేక్ మీరాభి, కుంభ యశోద, క్రిష్టం ప్రభావతి, గ్రామస్తులు పాల్గున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement