Sunday, April 28, 2024

ఎన్నిక‌ల నేప‌థ్యంలో గ్రామాల్లో పోలీసు క‌వాతు

గుంటూరు జిల్లాలోని ప‌లు గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈనెల 14వ తేదీన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జరగనున్న పంచాయితీ, ఎంపీటీసీ బై ఎన్నికల నేపథ్యంలో బుధ‌వారం ఆయా గ్రామాల్లో సత్తెనపల్లి డీఎస్పీ విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్, ప్రత్యేక బృందాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామాల్లో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించుకోవాలని, ఎటువంటి అల్లర్లు సృష్టించినా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement