Friday, May 3, 2024

దేశంలో మొద‌టి ప్రధాన న్యాయమూర్తికి 11ఏళ్ళు జైలు శిక్ష‌..ఎందుకో తెలుసా..

బంగ్లాదేశ్ 21వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి 11ఏళ్ళు జైలు శిక్ష ప‌డింది. అవినీతి ఆరోపణలపై బంగ్లాదేశ్ తొలి ప్రధాన న్యాయమూర్తికి ఈ శిక్ష విధించింది బంగ్లాదేశ్ న్యాయస్థానం. మనీలాండరింగ్, నమ్మక ద్రోహం కేసులో బంగ్లాదేశ్ కోర్టు మైనారిటీ హిందూ సమాజానికి చెందిన దేశంలోని మొదటి ప్రధాన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ సిన్హాకు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న సరేంద్ర కుమార్ సిన్హాకు మనీలాండరింగ్ కేసులో ఏడేళ్లు, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే… బంగ్లాదేశ్ పద్మా బ్యాంకు నుంచి తీసుకున్న 4 కోట్ల టాకాలు (4,70,000 యూఎస్ డాలర్లు) అప్పుగా తీసుకుని మనీలాండరింగ్ పాల్పడ్డాడని నిరూపితం అయింది. సిన్హా జనవరి 2015 నుండి నవంబర్ 2017 వరకు బంగ్లాదేశ్ 21వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మైనారిటీ హిందూ సమాజానికి చెందిన బంగ్లాదేశ్ మొదటి ప్రధాన న్యాయమూర్తిగా రికార్డ్ నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement