Friday, April 19, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో దుల్క‌ర్ స‌ల్మాన్..

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మం నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఈ ఛాలెంజ్ లో సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. కాగా మ‌ల‌యాళ న‌టుడు దుల్కర్‌ సల్మాన్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్కలు నాటారు. హీరోయిన్‌ అదితీ రావు హైదరీ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన దుల్కర్‌.. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోష‌క‌ర‌మ‌ని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.మొక్కలు, చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. తద్వారా మనకే కాకుండా అనేక తరాల కాలుష్య రహిత వాతావరణం సమకూరుతుంది’ అని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement