Saturday, April 27, 2024

Mangalagiri – టూరిస్ట్ లా వచ్చేవాళ్లు వద్దు… స్థానికుడు గంజి చిరంజీవిని గెలిపించండి – విజయసాయిరెడ్డి

మంగళగిరి, జనవరి,30:తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడూ బలంగా లేదని,వచ్చే ఎన్నికల్లో కూడా వరసగా మూడో సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు..మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు..

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు మంగళగిరిలో రెండు సార్లు మాత్రమే గెలిచిందని ఆయన గుర్తు చేశారు..ముఖ్యమంత్రి బడుగు బలహిన వర్గాలు,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ వర్గాల వారికి అధిక ప్రధాన్యత ఇస్తున్నారని చెప్పారు..మంగళగిరిలో చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారని,దానిలో భాగంగానే ఆ సామాజిక వర్గానికి సిటు కేటాయించారని తెలిపారు..మంగళగిరిలో స్థానికుడిగా ఉన్న గంజి చిరంజీవి కావాలో హైదరాబాదులో ఉండే టిడిపి అభ్యర్థి కావాలో మంగళగిరి ప్రజలు తెల్చుకోవాలని అన్నారు.

క్రీడలకు అధిక ప్రాధాన్యం

తాడేపల్లి నగరపాలక సంస్ధ ఆత్మకూరు వద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ సర్కిల్,పంపు హౌస్,పైప్ లైన్లు పలు అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్సీ మరుగుడి హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి,జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి,ఎంటిఎంసి కమిషనర్ నిరంజన్ కుమార్ లతో కలిసి అభివృద్ధి పనులను విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడారు..మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ8.5 కోట్ల రూపాయలతో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని,రాష్ట్రం నుండి ప్రపంచ స్థాయిలో మన క్రీడాకారులను అందించాలనే ఉద్దేశంతో అందులో భాగంగానే మంగళగిరిలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని అన్నారు.. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు..మన ముఖ్యమంత్రి విద్య,వైద్యం,గృహ నిర్మాణానికి అధిక ప్రధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement