Friday, May 17, 2024

లారీ ఢీకొని బ్యాంకు ఉద్యోగి మృతి

తెనాలి : లారీ ఢీకొని బ్యాంకు ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తెనాలి చెంచుపేట ఓవర్ బ్రిడ్జి పై చోటు చేసుకుంది.త్రీ టౌన్ ఎస్సై ఎం.విజయ్ కుమార్ వివరాల ప్రకారం దాకోజు శ్రీనివాస్ (42) అనే వ్యక్తి ఇండియన్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాడు.ఆయనకు భార్య,ఇద్దరు పిల్లలు కలరు.తెనాలి నుండి బ్యాంకు కు సైకిల్ పై వెళుతుండగా ఓవర్ బ్రిడ్జి పై తెనాలి నుండి వస్తున్న లారీ ఢీకొట్టడంతో అపస్మారక స్థితిలోనికి వెళ్ళాడు. స్థానికులు, పోలీసులు కలిసి హుటాహుటినా తెనాలి,జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు త్రీ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement